Wednesday, May 22, 2019

అంతర్జాతీయ ఎయిడ్స్ క్రోవ్వోత్తుల సంస్మరణ దినము

ప్రపంచ వ్యాప్తంగా హెచ్.ఐ.వి./ఎయిడ్స్ వలన మరణించిన వారి స్మ్రుత్యార్ధం మరియు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బాడిత కుటుంభాలకు మనమందరమూ అండగా ఉంటామని బరోషా ఇస్తూ ప్రతీ సంవత్సరము మే నెల ౩వ ఆదివారమున క్రోవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించడమైనది.  ఈ మౌన ప్రదర్శనలో ఈ సంవత్సరము “Intensifying the fight for Health and Rights” అనే నినాదంతో వైద్య మరియు ఆరోగ్య శాఖవారి అధికారులు మరియు సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, విజయ పాజిటివ్ నెట్ వర్కు వారి ఆద్వర్యంలో హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారు పాల్గొని హెచ్.ఐ.వి/ఎయిడ్స్ తో మరణించిన వారికి అంజలి ఘతించడం జరిగినది. ఈ సందర్బముగా అంతర్జాతీయ ఎయిడ్స్ క్రోవ్వోత్తుల సంస్మరణ దినమును విజయనగరంలో తే:19.05.2019దిన ఆదివారము సాయంత్రము గం.6.00లకు ఆర్.&బి కూడలి నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారి కార్యాలయం వరకు నిర్వహించడమైనది. తదుపరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారి కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేయడమైనది.  ఈ కార్యక్రమములో  డా. కె. విజయలక్ష్మి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరంవారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి. వ్యాధి గ్రస్తులందరికీ పెన్షన్ వచ్చే

లా భారోశా ఇస్తామని తెలిపారు, డా. జె. రవి కుమార్, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (ఎయిడ్స్ మరియు లెప్రసీ), విజయనగరం వారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి వచ్చే అన్ని మార్గాలను ఆపి వేయాలని ప్రజలూ అందరూ అవగాహన తో ఉండాలని కోరారు మరియు ఈ కార్యక్రమములో పి.బాలాజీ, ది.పి.ఎం., మరియు స్వచ్చంద సంస్థలు, పోలీసు కళాశాల విద్యార్ధులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది, పాజిటివ్ నెట్వర్కు, చైతన్య భారతీ, ఆర్.ఇ.ఎస్.,, లింకు వర్కర్లు (చైల్డ్ పండ ఇండియా) మొదలగు వారు ర్యాలీలో పాల్గొనడం జరిగినది.  

Wednesday, May 15, 2019

LWs Scheme-IEC కరపత్రాలు పంచటం


లింక్ వర్కర్ స్కీం ఆద్వర్యం లో గళావల్లి గ్రామం లో ఉపాధి హామీ కార్యక్రమం లో స్టాల్ నిర్వహించి ఉపాధిహామీ పనులు కు వచ్చిన గ్రామస్తులకు  హెచ్ .ఐ .వి /ఎయిడ్స్/టి.బి/ వడ దెబ్బ ల పైన అవగాహనా కార్యక్రమం  నిర్వహించి IEC కరపత్రాలు పంచటం జరిగినది .