జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అదేసముల మేరకు జిల్లలో ఏ.ఆర్.టి మల్టీ మంత్ డిస్పేన్సేసన్ (ART-Multi Month Dispensation)కార్యక్రమమును డా. జి. ఉషశ్రీ, జిల్లా ఆసుపత్రుల సమవాయ అధికారి గారి చేతులమీదుగా స్థానిక ఏ.ఆర్.టి కేంద్రములో ఈ రోజు ప్రరంబించడమైనది.

ఈ కార్యక్రమము యొక్క ముక్య ఉద్దేశ్యము హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తులు ఏ.ఆర్.టి మందుల కొరకు ప్రతీ నెలకు రావలసి వున్నది, ఈ కారణముగా వారికీ ఆ రోజు ఆదాయము పోతుంది మరియు ప్రయాణము కర్చులు, కష్టముగా వుంటుంది. హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తుల సౌలబ్యాము కొరకు క్రమము తప్పకుండా మందులు వాడే వారికి ఈ కొత్త విదానము ద్వార మూడు నెలలకు సరిపడా మందులు ఒక్కసారే తీసుకోన వచ్చు. ఇలా చేయటము ద్వార హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తులకు శ్రమ మరియు కర్చు తగ్గుతుంది అంతె కాకుండా ఏ.ఆర్.టి సిబ్బంది పై భారము కుడా తగ్గుతుంది.

ఈ కార్యక్రమములో డా. జే. రవికుమార్, అదనపు జిల్లా వైద్య ఆరోగ శాఖాధికారి (ఎయిడ్స్ & లేప్రోసి), డా. సీతారామ రాజు, సూపరింటెండెంట్, మహారాజ ఆసుపత్రి, శ్రీ.అర్. ప్రవీణ్, శ్రీ నలిని ప్రోగ్రమ్ ఆఫీసర్, ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, శ్రీ. పి. బాలాజీ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, డా. కే. శంకార రావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ మరియు శ్రీ. యెన్. సాక్షి గోపాల్, జిల్లా సుపెర్వైసర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment