ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, విజయనగరం వారు సంయుక్తం గా తేది 21.01.2019 నుండి తేది
31.01.2019 వరకు కళాజాత బృందాలతో వీధి నాటకముల ద్వారా హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పై
అవగాహన కల్పించుటకు కార్యక్రమములు నిర్వహిస్తున్నాము. దీనిలో
ఆంద్ర ప్రదేశ్ దియేటర్స్ మరియు ప్రతిభా ఆర్ట్స్ అనే రెండు కళా బృందాలు ద్వారా
మొత్తం 30 కార్యక్రమములు ముందుగా ఎంపిక చేసిన గ్రామాలలో నిర్వహించెదరు. ఈ కళాజాత కార్యక్రమములో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు
తీసుకోవాలి, వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలసి
జీవించాలి వాటిపై అవగాహన గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేదరు.
దీనిలో భాగంగా తేది 21.01.2019న శ్రీ జిల్లా కలెక్టరు, విజయనగరం
వారి కార్యాలయము వద్ద వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కళాజాత
కార్యక్రమమును డా. ఎం. హరి జవహర్లాల్, ఐ.ఎ.ఎస్., కలెక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేట్, విజయనగరం
వారిచే జెండా ఊపి ప్రారంభించడమైనది. ఈ కార్యక్రమములో డా. కె. విజయలక్ష్మి, జిల్లా వైద్య
మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం మరియు డా.జె.రవి కుమార్,
అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (ఎయిడ్స్ మరియు
లెప్రసీ), విజయనగరం, పి. బాలాజీ,
డి.పి.ఎం., వైద్య సిబ్బంది మరియు ఎన్.జి.ఓ.లు
మరియు కళాజాత బృందాలు పాల్గొన్నాయి.

No comments:
Post a Comment