తేది:30.01.2019 మహారాజ ఆసుపత్రిలో ఎ.ఆర్.టి. సెంటరు నందు స్వచ్చంద సంస్థలు మరియు ఎ.ఆర్.టి సిబ్బందితో ఒక సమన్వయ సమావేశము ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశములో ఎ.ఆర్.టి. మందులు పంపిణీ మరియు ఇతర సేవలు గురించి చర్చించడమైనది. జిల్లాలో కొత్తగా హెచ్.ఐ.వి. బాధితుల కొరకు హెచ్.ఐ.వి వైరల్ లోడు పరీక్షలు అందుబాటులో తేవడమైనది. ఈ పరీక్షలు ప్రతీ సోమవారము మరియు గురువారము జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి. హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులు క్రమము తప్పకుండా ఎ.ఆర్.టి మందులు వాడాలని దానికి కావలసిన చర్యలు చేపట్టాలని కార్యక్రమములో పాల్గొన్న జిల్లా ఆసుపత్రుల సమన్వయాదికారి జి. ఉషశ్రీ గారు అన్నారు. ఈ సందర్బముగా ఆంద్రప్రదేశ్ లో ఉన్న ఎ.ఆర్.టి సెంటర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను విజయనగరం ఎ.ఆర్.టి. కేంద్రమునకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఇచ్చిన ప్రశంశా పత్రమును జిల్లా ఆసుపత్రుల సమన్వయాదికారి జి. ఉషశ్రీ గారు ఎ.ఆర్.టి సిబ్బంది అందజేసారు మరియు వారికి జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణలో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు తెలియజేసారు.
No comments:
Post a Comment