Wednesday, May 22, 2019

అంతర్జాతీయ ఎయిడ్స్ క్రోవ్వోత్తుల సంస్మరణ దినము

ప్రపంచ వ్యాప్తంగా హెచ్.ఐ.వి./ఎయిడ్స్ వలన మరణించిన వారి స్మ్రుత్యార్ధం మరియు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ బాడిత కుటుంభాలకు మనమందరమూ అండగా ఉంటామని బరోషా ఇస్తూ ప్రతీ సంవత్సరము మే నెల ౩వ ఆదివారమున క్రోవ్వొత్తులతో మౌన ప్రదర్శన నిర్వహించడమైనది.  ఈ మౌన ప్రదర్శనలో ఈ సంవత్సరము “Intensifying the fight for Health and Rights” అనే నినాదంతో వైద్య మరియు ఆరోగ్య శాఖవారి అధికారులు మరియు సిబ్బంది, స్వచ్చంద సంస్థలు, విజయ పాజిటివ్ నెట్ వర్కు వారి ఆద్వర్యంలో హెచ్.ఐ.వి తో జీవిస్తున్న వారు పాల్గొని హెచ్.ఐ.వి/ఎయిడ్స్ తో మరణించిన వారికి అంజలి ఘతించడం జరిగినది. ఈ సందర్బముగా అంతర్జాతీయ ఎయిడ్స్ క్రోవ్వోత్తుల సంస్మరణ దినమును విజయనగరంలో తే:19.05.2019దిన ఆదివారము సాయంత్రము గం.6.00లకు ఆర్.&బి కూడలి నుండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారి కార్యాలయం వరకు నిర్వహించడమైనది. తదుపరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారి కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో మౌన ప్రదర్శన చేయడమైనది.  ఈ కార్యక్రమములో  డా. కె. విజయలక్ష్మి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరంవారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి. వ్యాధి గ్రస్తులందరికీ పెన్షన్ వచ్చే

లా భారోశా ఇస్తామని తెలిపారు, డా. జె. రవి కుమార్, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (ఎయిడ్స్ మరియు లెప్రసీ), విజయనగరం వారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి వచ్చే అన్ని మార్గాలను ఆపి వేయాలని ప్రజలూ అందరూ అవగాహన తో ఉండాలని కోరారు మరియు ఈ కార్యక్రమములో పి.బాలాజీ, ది.పి.ఎం., మరియు స్వచ్చంద సంస్థలు, పోలీసు కళాశాల విద్యార్ధులు, వైద్య మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది, పాజిటివ్ నెట్వర్కు, చైతన్య భారతీ, ఆర్.ఇ.ఎస్.,, లింకు వర్కర్లు (చైల్డ్ పండ ఇండియా) మొదలగు వారు ర్యాలీలో పాల్గొనడం జరిగినది.  

Wednesday, May 15, 2019

LWs Scheme-IEC కరపత్రాలు పంచటం


లింక్ వర్కర్ స్కీం ఆద్వర్యం లో గళావల్లి గ్రామం లో ఉపాధి హామీ కార్యక్రమం లో స్టాల్ నిర్వహించి ఉపాధిహామీ పనులు కు వచ్చిన గ్రామస్తులకు  హెచ్ .ఐ .వి /ఎయిడ్స్/టి.బి/ వడ దెబ్బ ల పైన అవగాహనా కార్యక్రమం  నిర్వహించి IEC కరపత్రాలు పంచటం జరిగినది .



Thursday, March 21, 2019

హెచ్. ఐ .వి / ఎయిడ్స్ వ్యాధుల పట్ల ప్రజల లో అవగాహన పెంపొందించటానికి వాల్ పెయింటింగ్స్

చైల్డ్ ఫండ్ ఇండియా  - లింక్ వర్కర్ స్కీం కు వివిధ గ్రామాలలో వున్న గ్రామ ముఖ్యులు మరియు గ్రామ పంచాయతి వారు హెచ్. ఐ .వి / ఎయిడ్స్   వ్యాధుల పట్ల  ప్రజల లో అవగాహన పెంపొందించటానికి వాల్ పెయింటింగ్స్ సమకూర్చటం  జరిగినది. 













లింక్ వర్కర్స్ ప్రోగ్రాం, విజయనగరం ఆధ్వర్యములో హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తుల కుటుంబాలకు పౌష్టికాహార పంపిణి కార్యక్రమము

చైల్డ్ ఫండ్ ఇండియా - లింక్ వర్కర్స్ ప్రోగ్రాం, విజయనగరం ఆధ్వర్యములో హెచ్.ఐ.వి వ్యాధి గ్రస్తుల  కుటుంబాలకు పౌష్టికాహార పంపిణి కార్యక్రమము మార్చ్ 18 తేది నాడు స్థానిక యూత్ హాస్టల్ లో నిర్వహించాదమైనది. ఈ కార్యక్రమములో డా. జె. రవికుమార్, అదనపు జిల్లా వైద్య శాఖాధికారి (ఎయిడ్స్ & లేప్రోసి), విజయనగరం వారు ముఖ్య అతిధి గా పాల్గొన్నారు.  శ్రీ. ప్రోభాకర్ గారు, రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్, చైల్డ్ ఫండ్ ఇండియా, శ్రీ. పి. బాలాజీ, జిల్లా ప్రోగ్రమ్ మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, శ్రీ ఏం. పద్మ, ప్రెసిడెంట్, విజయ పాజిటివ్ నెట్వర్క్ వారు అతిధులుగా పాల్గొన్నారు.  ఈ కర్యమములో 50 మంది హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు పౌష్టిక ఆహారము అందజేశారు.   ఈ పోవ్స్తికహారము లింక్ వర్కర్ దాతల దగ్గరనుంచి సేకరించినది.

 

Wednesday, March 20, 2019

హెచ్.ఐ.వి/ఎయిడ్స్ చికిత్సా మేలుకువలపై ఒక్కరోజు శిక్షణ

జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, విజయనగరం మరియు బ్రైటర్ ఫ్యూచర్ ట్రస్ట్ సంయుక్తముగా జిల్లలో ఐ.సి.టి.సి కోన్సేలర్లకు మరియు ప్రాజెక్ట్ మనేజర్లకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ చికిత్సా మేలుకువలపై ఒక్కరోజు శిక్షణ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమములో ముక్య సిక్షకులుగా శ్రీ. జేమ్స్ హ్యాండ్ మరియు శ్రీ. అనేలా వాటర్స్, యు.కే వారు నిర్వహించదమైనది. ఈ కార్య క్రమములో ముక్య అతిధిగా డా. జే. రవికుమార్ గారు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వారు పాల్గొన్నారు, శ్రీ. పి. బాలాజీ, జిల్లా ప్రోగ్రమ్ మేనేజర్, శ్రీ. యెన్. సాక్షి గోపాల, జిల్లా సుపర్వైసర్, శ్రీ. పి. విక్టర్ గారు ప్రాజెక్ట్ డైరెక్టర్, బ్రైటర్ ఫ్యూచర్ ట్రస్ట్ పాల్గొన్నారు.

Friday, February 1, 2019

ఎ.ఆర్.టి. సమన్వయ సమావేశము

తేది:30.01.2019   మహారాజ ఆసుపత్రిలో ఎ.ఆర్.టి. సెంటరు నందు స్వచ్చంద సంస్థలు మరియు ఎ.ఆర్.టి సిబ్బందితో ఒక సమన్వయ సమావేశము ఏర్పాటు చేయడమైనది.  ఈ సమావేశములో ఎ.ఆర్.టి. మందులు పంపిణీ మరియు ఇతర సేవలు గురించి చర్చించడమైనది.  జిల్లాలో కొత్తగా హెచ్.ఐ.వి. బాధితుల కొరకు హెచ్.ఐ.వి వైరల్  లోడు పరీక్షలు అందుబాటులో తేవడమైనది.  ఈ పరీక్షలు ప్రతీ సోమవారము మరియు గురువారము జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అందుబాటులో ఉంటాయి.  హెచ్.ఐ.వి వ్యాధిగ్రస్తులు క్రమము తప్పకుండా ఎ.ఆర్.టి మందులు వాడాలని దానికి కావలసిన చర్యలు చేపట్టాలని కార్యక్రమములో పాల్గొన్న జిల్లా ఆసుపత్రుల సమన్వయాదికారి జి. ఉషశ్రీ గారు అన్నారు.  ఈ సందర్బముగా ఆంద్రప్రదేశ్ లో  ఉన్న ఎ.ఆర్.టి సెంటర్లలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను విజయనగరం ఎ.ఆర్.టి. కేంద్రమునకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఇచ్చిన ప్రశంశా పత్రమును జిల్లా ఆసుపత్రుల సమన్వయాదికారి జి. ఉషశ్రీ గారు ఎ.ఆర్.టి సిబ్బంది అందజేసారు మరియు వారికి జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణలో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు తెలియజేసారు.

Friday, January 25, 2019

YDO Net work Advaryamlo యువజన దినోత్సవం

ఈ రోజు అనగా జనవరి 12 2019 న స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా జరుపుకున్న జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని బొబ్బిలి లో గల YDO's Network TI Project (స్వచ్చంద సంస్ద) అధ్వర్యంలో బొబ్బిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న "సంక్రాంతి సంబరాలు" కార్యక్రమంలో భాగంగా YDO Network సిబ్బంది పాల్గొని స్టాల్ ఏర్పాటు చేసి HIV/AIDS పై యువతకు అవగాహన కలిగించటం జరిగింది. ముఖ్యంగా యువత వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పటం జరిగింది. ఈ సందర్బంగా వివరిస్తూ HIV వ్యాది పై వారికున్న సందేహాలను నివృత్తి చేయటం జరిగింది. 

                       


                                                                                                                                         












                                                           

గుమ్మలక్ష్మి పురం లో యువజన దినోత్సవం సందర్బంగా HIV/AIDS పై యువతకు అవగాహన కలిగిస్తున్న YDO సిబ్బంది గీతారాణిగారు 



    




















ఖైదీలకు HIV రక్త పరీక్షలు

ఈ  రోజు అనగా జనవరి 4 2019 న బొబ్బిలి సబ్ జైలు లో YDO NET WORK TI PROJECT BOBBILI వారి ఆధ్వర్యంలో ఖైదీలకు  HIV రక్త పరీక్షల కోసం  CBHT  కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ  కార్యక్రమం లో ఖైదీలు మరియు జైలు స్టాఫ్ మెంబెర్స్ కూడా పాల్గొని వారియొక్క HIV స్థితిని తెలుసుకోవడం జరిగింది. DISTRICT PROGRAMME MANAGER బాలాజీ గారు ఖైదీలకు HIV/AIDS  పై అవగాహనా మరియు నివారణ చర్యలను, సుఖవ్యాధులు యొక్క లక్షణాలను వివరించటం జరిగింది.  




































                

Thursday, January 24, 2019

ఖైదీలకు HIV రక్త పరీక్షలు

ఈ  రోజు అనగా Dec 21 2018న పార్వతీపురం సబ్ జైలు లో YDO Net work TI Project Bobbili వారి ఆధ్వర్యంలో ఖైదీలకు  HIV రక్త పరీక్షల కోసం  CBHT  కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ  కార్యక్రమం లో ఖైదీలు మరియు జైలు స్టాఫ్ మెంబెర్స్ కూడా పాల్గొని వారియొక్క HIV స్థితిని తెలుసుకోవడం జరిగింది. ఖైదీలకు YDO సిబ్బంది HIV/AIDS  పై అవగాహనా మరియు సుఖవ్యాధులు యొక్క లక్షణాలను వివరించటం జరిగింది. అదే విదంగా పార్వతీపురం బై పాస్ కాలనీ లో ప్రజలకు CBHT  పరీక్షలు నిర్వహించి HIV/AIDS పై అవగాహన కలిగించటం  జరిగింది.                                                                                                                                   


                                                                                                                                                                                                   






                                                                                                                                                                                                                   


















HIV/AIDS పై అవగాహన కార్యక్రమం

ఈ  రోజు అనగా తేదీ 13-12-2018 న కురూపం ప్రాంతం లో YDO Net Work  అవుట్ రీచ్ వర్కర్ A  గీతారాణిగారు CBHT testings for general community కార్యక్రమాన్ని నిర్వహించడం  జరిగింది. అదేవిదంగా కొంతమంది  మహిళలకు, MSM మరియు ట్రాన్స్ జెండర్ లకు HIV/AIDS పై అవగాహన కలిగించడం జరిగింది.

                                                    
                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 




                                                             

Wednesday, January 23, 2019

లింక్ వర్కర్ స్కీం ఆద్వర్యం లో గోలజాం గ్రామము లో ఉచిత విద్య శిబిరం

తే. 23-1-2019 ది  న లక్కవరపు కోట మండలం గోలజాం  గ్రామము లో స్థానిక ప్రాథమిక వైద్య  కేంద్రం వారి  సహాయం తో  చైల్డ్ ఫండ్ ఇండియా  - లింక్ వర్కర్  స్కిమ్  వారు   ఉచిత వైద్య   శిబిరం నిర్వహించటం జరిగినది.

ఈ శిబిరం లో  150 మంది కి ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణి చేయటం జరిగినది. మరియు  48 మంది కి  H.I.V  పరీక్షలు చేయటం జరిగినది . ఈ కార్యాక్రమాని కి  బొద్దాం ప్రాథమిక వైద్య  కేంద్రం  హెల్త్ సూపర్వైజర్  ఎం. అప్పా రావు, A.N.M ఆర్.చిన్నతల్లి మరియు లింక్ వర్కర్ స్కీం ప్రతినిదులు  D.R.P.  - ఎస్.అప్పల నాయుడు,  సూపర్వైజర్  జి.కన్నం నాయుడు మరియు లింక్ వర్కర్ ఎం. పద్మ  ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం   జరిగింది.  

Tuesday, January 22, 2019

“వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన”


ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, విజయనగరం వారు సంయుక్తం గా తేది 21.01.2019 నుండి తేది 31.01.2019 వరకు కళాజాత బృందాలతో వీధి నాటకముల ద్వారా హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పై అవగాహన కల్పించుటకు కార్యక్రమములు నిర్వహిస్తున్నాము.  దీనిలో ఆంద్ర ప్రదేశ్ దియేటర్స్ మరియు ప్రతిభా ఆర్ట్స్ అనే రెండు కళా బృందాలు ద్వారా మొత్తం 30 కార్యక్రమములు ముందుగా ఎంపిక చేసిన గ్రామాలలో నిర్వహించెదరు.    ఈ కళాజాత కార్యక్రమములో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలసి జీవించాలి వాటిపై అవగాహన గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేదరు. 
దీనిలో భాగంగా తేది 21.01.2019న శ్రీ జిల్లా కలెక్టరు, విజయనగరం వారి కార్యాలయము వద్ద వీది నాటకము ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కళాజాత కార్యక్రమమును డా. ఎం. హరి జవహర్లాల్, ఐ.ఎ.ఎస్., కలెక్టరు మరియు జిల్లా మెజిస్ట్రేట్, విజయనగరం వారిచే జెండా ఊపి ప్రారంభించడమైనది.  ఈ కార్యక్రమములో డా. కె. విజయలక్ష్మి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం మరియు డా.జె.రవి కుమార్, అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (ఎయిడ్స్ మరియు లెప్రసీ), విజయనగరం, పి. బాలాజీ, డి.పి.ఎం., వైద్య సిబ్బంది మరియు ఎన్.జి.ఓ.లు మరియు కళాజాత బృందాలు పాల్గొన్నాయి.