Monday, December 3, 2018

డిసెంబరు 1వ తేదిన ప్రపంచ ఎయిడ్స్ దినము కార్యక్రమమును

జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రాణ సంస్థ ప్రతీ సంవత్సరం డిసెంబరు 1వ తేదిన ప్రపంచ ఎయిడ్స్ దినము కార్యక్రమమును నిర్వహించడమైనది.  ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశ్యము “మీ హెచ్.ఐ.వి స్ధితిని తెలుసుకొండి!’ (Know Your Status) ను అనుసరించి కార్యాచరణ ప్రణాలికను జిల్లాలో కార్యక్రమములు ఏర్పాటుచేస్తున్నాము.  ఈ సందర్బముగా జిల్లాలో తేది: 01.12.2018న ఉదయం 9.30 గం.లకు అధికారులు, స్వచ్చంద సంస్థలు, పాజిటివ్ నెట్వర్కులు, ఎన్.ఎస్.ఎస్., ఎన్.సి.సి. విద్యార్ధినీ/విద్యార్ధులు మరియు నర్సింగు విద్యార్ధులతో ర్యాలీని జిల్లా కలెక్టరు వారి కార్యాలయం వద్ద నుండి ప్రారంభమై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం వరకు చేయడమైనది.తదుపరి వారందరితో సమావేశామును జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలయం ఏర్పాటు చేయడమైనది.   ఇందులో డా. జె. రవి కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (ఎయిడ్స్ మరియు లెప్రసీ), విజయనగరం వారు మాట్లాడుతూ హెచ్.ఐ.వి/ఎయిడ్స్ లో జిల్లా ప్రగతిని నివేదించారు. తదుపరి అతిదుల ప్రసంగంలో డా. వి.ఎస్. ప్రసాదు, చైర్మన్, హెచ్.డి.ఎస్., జిల్లా కేంద్ర ఆసుపత్రి వారు పాల్గొని ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశ్యం ను అనుసరించి అందరూ హెచ్.ఐ.వి స్థితిని తెలుసుకోవాలని మరియు హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ముఖ్యంగా విద్యార్ధిని/విద్యార్ధులు తో సాధ్యమని తెలిపారు.   తదుపరి  ఎం. పద్మ, ప్రెసిడెంట్, విఎన్.పి ప్లస్ వారు మాట్లాడుతూ జిల్లాలో  హెచ్.ఐ.వి రోగులకు అందిన సేవలకు సంతృప్తి తెలుపుతూ అందరికీ వైద్య సేవలు అందించాలని కోరారు.  ప్రభుత్వం నుండి వస్తున్న పించను అందరికీ అందేలా చూడాలని కోరారు.  ప్రభుత్వం నుండి సంక్షేమ కార్యక్రమాలు పెంచాలని కోరారు.  తదుపరి డా. కె.విజయలక్ష్మి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, విజయనగరం వారు మాట్లాడుతూ జిల్ల్లాలో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ సేవలు అందరికీ అందుతున్నాయని మరియు జిల్లాలో వైద్య సేవలు హెచ్.ఐ.వి రోగులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తమరికి తెలియజేయాలని కోరారు.  పించన్లు విషయంలో పై అధికారులకు తెలిపి అందరికీ అందేలా న్యాయం చేసేలా చేస్తామని తెలిపారు.  తదుపరి పాల్గొన్న వారందరితో హెచ్.ఐ.వి/ఎయిడ్స్ నిర్మాలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.  తదుపరి ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి అతిధుల చేతుల మీదుగా సత్కరించడమైనది.  ఈ కార్యక్రమములో శ్రీహరి గారు, జిల్లా జెడ్జిగారు, డా. చామంతి, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ., మరియు జిల్లాలో గల స్వచ్చంద సంస్థలు, విద్యార్ధినీ/విద్యార్ధులు, నర్సింగు సిబ్బంది, వైద్య సిబ్బంది, ఎన్.సి.సి./ఎన్.ఎస్.ఎస్. విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేయడమైనది.

No comments:

Post a Comment