Tuesday, December 4, 2018

వైదేహి డైట్ కళాశాలలో యువతకు హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము

జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యములో  వైదేహి డైట్ కళాశాలలో, అయ్యన్న పేట,  “యువతకు హెచ్  వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము”  నిర్వహించడమైనది. 

 ఈ కార్యక్రములో పి బాలాజీజిల్లా ప్రోగ్రాం మేనేజర్జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థప్రసంగించారు ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ హెచ్  వి నివారణ ఆరోగ్య శాఖా ఒక్కరి బాధ్యతే కాదని దీనిలో యువత పాత్ర చాల కీలకమని.  హెచ్  వి/ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది మరియు హెచ్  వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని  తెలియజేసారు.  సూదులు సిరంజిలురక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్  వి సోకకుండా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని,   సురక్షితము కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని తెలియజేసారు. యువత మంచి భవిష్యత్తుని హెచ్   వి బారిన పదనివ్వద్దని.

పెళ్ళికి ముందు హెచ్  వి పరీక్షా చేయించు కోవటము పై విస్తృత చర్చ జరగాలనిపెళ్ళికి ముందు హెచ్  వి పరిక్ష అవసరము గుర్తించాలనిజిల్లలో కొంత మంది స్త్రీలు చిన్న వయస్సులో భర్తను హెచ్  వి వ్యాధి కారణముగా కోల్పోయీ  చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారము పెళ్ళికి ముందు హెచ్  వి పరీక్షా అని చెప్పారు.  నిర్లక్ష్య ప్రవర్తనతో జీవిస్తే ఎవ్వరైనా హెచ్  వి భారిన పడే అవకాసం వుందని, A. B. C. ని ఆచరించడం ద్వార హెచ్.ఐ.వి. వ్యాధి సోకకుండా యువతను కాపాడవచ్చని తెలియజేసారు.  A. B. C. పై తాయారు చేసిన పోస్టర్ ను అందజేశారు. హెచ్  వి వ్యాధి నివారణలో యువత చురుకుగా పాల్గొనాలనిహెచ్  వి/ఎయిడ్స్ అవగాహనా కలిగివుండటమే కాకుండా పది మందికిఅవగాహనా కల్పించాలని కోరారు.

No comments:

Post a Comment