
ఈ కార్యక్రములో పి బాలాజీ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, ప్రసంగించారు ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ హెచ్ ఐ వి నివారణ ఆరోగ్య శాఖా ఒక్కరి బాధ్యతే కాదని దీనిలో యువత పాత్ర చాల కీలకమని. హెచ్ ఐ వి/ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది మరియు హెచ్ ఐ వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని తెలియజేసారు. సూదులు సిరంజిలు, రక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ ఐ వి సోకకుండా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని, సురక్షితము కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని తెలియజేసారు. యువత మంచి భవిష్యత్తుని హెచ్ ఐ వి బారిన పదనివ్వద్దని.
పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరీక్షా చేయించు కోవటము పై విస్తృత చర్చ జరగాలని, పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరిక్ష అవసరము గుర్తించాలని, జిల్లలో కొంత మంది స్త్రీలు చిన్న వయస్సులో భర్తను హెచ్ ఐ వి వ్యాధి కారణముగా కోల్పోయీ చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారము పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరీక్షా అని చెప్పారు. నిర్లక్ష్య ప్రవర్తనతో జీవిస్తే ఎవ్వరైనా హెచ్ ఐ వి భారిన పడే అవకాసం వుందని, హెచ్ ఐ వి వ్యాధి నివారణలో యువత చురుకుగా పాల్గొనాలని, హెచ్ ఐ వి/ఎయిడ్స్ అవగాహనా కలిగివుండటమే కాకుండా పది మందికి అవగాహనా కల్పించాలని కోరారు.
అనంతరం శ్రీ అబ్దుల్ రవూఫ్ గారు స్వచ్చంద రక్తదానుము పై అవగాహనా కల్పించారు. పిల్లలలో రక్త దానం పై వున్నా అపోహలను తొలగించారు.
ఈ కార్యక్రమములో శ్రీ. పి. బాలాజీ, జిల్లా ప్రోగ్రాం మేనేజర్, శ్రీ. అబ్దుల్ రవూఫ్ , శ్రీ మురళి గారు, ప్రిన్సిపాల్ గాయత్రీ కాలేజీ , పాల్గొన్నారు.
No comments:
Post a Comment