Friday, November 2, 2018

Awareness Camp at College

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అదేసముల మేరకు ఈ రోజు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యములో గాయత్రీ కళాశాల, గొట్లం గ్రామములో యువతకు హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై అవగాహనా కార్యక్రమము”  నిర్వహించడమైనది. 

          ఈ కార్యక్రములో పి బాలాజీజిల్లా ప్రోగ్రాం మేనేజర్జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థప్రసంగించారు ఈ సందర్బముగా అయన మాట్లాడుతూ హెచ్ ఐ వి నివారణ ఆరోగ్య శాఖా ఒక్కరి బాధ్యతే కాదని దీనిలో యువత పాత్ర చాల కీలకమని.  హెచ్ ఐ వి/ఎయిడ్స్ ఎలా వ్యాపిస్తుంది మరియు హెచ్ ఐ వి సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని  తెలియజేసారు.  సూదులు సిరంజిలురక్త మార్పిడి మరియు తల్లి నుండి బిడ్డకు హెచ్ ఐ వి సోకకుండా రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తగు జాగ్రత్తలు తీసుకుంటుందని,   సురక్షితము కాని శృంగారము కారణమూగా ఈ వ్యాధి ఎక్కువవగా సోకుతుందని తెలియజేసారు. యువత మంచి భవిష్యత్తుని హెచ్ ఐ  వి బారిన పదనివ్వద్దని.
పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరీక్షా చేయించు కోవటము పై విస్తృత చర్చ జరగాలని, పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరిక్ష అవసరము గుర్తించాలని, జిల్లలో కొంత మంది స్త్రీలు చిన్న వయస్సులో భర్తను హెచ్ ఐ వి వ్యాధి కారణముగా కోల్పోయీ  చాలా ఇబ్బందులు పడుతున్నారని దీనికి పరిష్కారము పెళ్ళికి ముందు హెచ్ ఐ వి పరీక్షా అని చెప్పారు.  నిర్లక్ష్య ప్రవర్తనతో జీవిస్తే ఎవ్వరైనా హెచ్ ఐ వి భారిన పడే అవకాసం వుందనిహెచ్ ఐ వి వ్యాధి నివారణలో యువత చురుకుగా పాల్గొనాలనిహెచ్ ఐ వి/ఎయిడ్స్ అవగాహనా కలిగివుండటమే కాకుండా పది మందికి అవగాహనా కల్పించాలని కోరారు.
అనంతరం శ్రీ అబ్దుల్ రవూఫ్ గారు స్వచ్చంద రక్తదానుము పై అవగాహనా కల్పించారు.  పిల్లలలో రక్త దానం పై వున్నా అపోహలను తొలగించారు.
ఈ కార్యక్రమములో  శ్రీ. పి. బాలాజీజిల్లా ప్రోగ్రాం మేనేజర్,  శ్రీ. అబ్దుల్ రవూఫ్ శ్రీ మురళి గారుప్రిన్సిపాల్ గాయత్రీ కాలేజీ పాల్గొన్నారు.

No comments:

Post a Comment